ఈ నెల 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించడానికి రైల్వే సిద్ధమైంది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయించింది. దేశంలోని 15 ముఖ్య నగరాలకు ఈ రైళ్లను నడపనున్నారు. దిల్లీ నుంచి దిబ్రుగఢ్, అగర్తల, హౌడా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మద్గామ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ముతావి ప్రాంతాలకు రైళ్లు నడపనున్నారు. రేపు సాయంత్రం నాలుగు తర్వాత ఈ రైళ్లను ఆన్లైన్ బుకింగ్ మొదలవుతుంది.
