ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఆగిరిపల్లిలోని హీల్ పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. 8 రోజలపాటు ఉపాధ్యాయులకు వసతి కల్పించామని, ఎంపికైన వారికి శీక్షణలో పాల్గొనేలా అనుమతులివ్వాలని డీఈవో ఎంవీ. రాజ్యలక్ష్మీ,ఎంఈవో, హెచ్ ఎంలకు ఆదివారం ఆదేశాలు జారీచేశారు. ఒక్కో మండలానికి నలుగురు ఉపాధ్యాయుల చొప్పున శిక్షణలో పాల్గొననున్నారు.
