నెల్లూజిల్లా కావలిలో ఈనెల 14, 15 తేదీల్లో జరిగిన 88వ మాస్టర్ అథ్లెటిక్
చాంపియషిప్ – 2018 లో బందరు వాసులు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 40 + విభాగంలో వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ మత్తి. అరుణ 100 మీటర్లు,200 మీటర్లు లాంగ్జంప్, 4 – 400, 4- 400 మీటర్ల పరుగుపందెంలో ఐదు బంగారు పతకాలను దక్కించుకున్నారు. బందరుకు చెందిన గృహిణి రిజ్వాన “హైజంప్, ట్రిపుల్ జంప్ విభాగాల్లో బంగారు పతకాలను సాధించారు. 100 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకాన్ని ఆమె గెలుచుకున్నారు. 4.100, 4- 400 మీటర్ల పరుగుపందేల్లో బంగారు పతకాలను ఆమె గెలుచుకున్నారు. 40 + విభాగం లో బంగారు పతకాలు గెలుచుకున్న మహిళలను సోమవారం జేసీ కెమాధవీలత తన చాంబరులో అభినందించారు. వీరిద్దరూ ఫిబ్రవరి 5 నుంచి వతేదీవరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి మాన్టర్ అథ్లెటిక్ చాంపియషిప్-2020 పోటీల్లో పొల్గొననున్నారు. అభినందన కార్యక్రమంలో జేసీతో పాటు డీఈవో ఎంవీ. రాజ్యలక్ష్మి, సర్వశిక్షా అభియాన్ పీడీ కేడీవీఎం ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు.

పరుగుల గాంధీకి స్వర్ణ పతకాలు 89వ మాస్టర్ అథ్లెటిక్ చాంపియషిప్ 2019లో +40 విభాగంలో బందరుకు చెందిన నరహరిశెట్టీ మోహన్ దాస్ కరంచంద్గాంధీ(పరుగుల గాంటి రెండు
బంగారు పతకాలు, వెండి పతకాన్ని గెలుచుకున్నారు.1500 మీటర్ల పరుగుపందెం, 5000 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలను ఆయన గెలుచుకోగా,800 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు.
