ఇంటర్నేషనల్ పసిఫిక్ స్పోర్స్ ఫెడరీషన్ ఆధ్వర్యంలో నేపాల్లో జరిగిన ఇండో నేపాల్ పనిఫిక్ క్రికెట్ పోటీల్లో మచిలీపట్నం హిందూ కళాశాల క్రీడాకారిణి టి. మంజు ప్రథమ బహుమతి సాధించింది. భారత జుట్టుకు ప్రాతినిధ్యం వహించిన మంజు నేపాల్ జట్టుపై గెలిచింది. నేపాల్లోని పోక్రా మైదానంలో జరిగిన పోటీల్లో బ్యాటింగ్, క్యాచ్ లోనూ ప్రతిభను ప్రదర్శించింది. ఈ పోటీల్లో మాల్తీవులు,ఇండోనేషియా, నేపాల్స్ శ్రీలంక, భారతదేశాల జట్లు తలపడ్డాయి.ఈ సందర్భంగా శనివారం క్రీడాకారిణిని పలువురు,కోచ్ శ్రీనివాసరావు మురళీకృష్ణ అభినందించారు.
