జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 19-20 సంవత్సరానికి వన్ఎస్టీఎఫ్డీసీ పథకం కింద నాన్ బ్యాంక్ లింకేజి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 10వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం. ఈశ్వరరావు తెలిపారు. పథకాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 44 మంది అభ్యర్థులు విజయవాడ సబ్కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు వయస్సు, విద్యార్హత, కులం, తదితరులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఇతర వివరాల కోసం 9296600406,7989800366 నెంబర్లను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.