మచిలీపట్నం మూడు స్తంభాలు సెంటర్ లో లారీ ప్రమాదం. విజయవాడ నుండి పాలకొల్లు కు బయల్దేరిన ట్రాన్స్పోర్ట్ లారీ. మూడు స్తంభాల సెంటర్ లో పెడన బైపాస్ రోడ్డులో కి మలుపు తిరుగుతుండగా బ్రేక్ ఫెయిల్. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ స్తంభానికి ఎదురుగా ఉన్న సిమెంట్ దిమ్మ ఢీకొని ఆగిన లారీ.తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం జరగడంతో తృటిలో తప్పిన పెను ప్రమాదం.ఈ ప్రమాదంలో స్థానికులతో పాటు లారీ డ్రైవర్ సురక్షితం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.
