తెలుగు నాటక విమర్శక పితామహుడు పురాణం సూరి శాస్త్రి గారు–బందరు

0
1201

పురాణం సూరి శాస్త్రి గారు 1888లో బందరు లో జన్మించి యాభై మూడేళ్ళు మాత్రమె జీవించి 1941లో మరణించారు .ఆగర్భ శ్రీ మంతుల కుటుంబం వారిది .రసాయన శాస్త్రం లో పట్ట భద్రులు .జీవితాన్ని సాహిత్యానికి, శాస్త్ర చర్చ కు అంకితం  చేశారు .అనాటి అవి భక్త కృష్ణా జిల్లా లో (కృష్ణా ,గుంటూరు ,పశ్చిమ గోదావరి ,ప్రకాశం జిల్లాలు కలిపి)డిగ్రీ లో ప్రప్రధమ పట్ట భద్రులు శాస్త్రి గారు .ఎన్ని రాష్ట్రాలు తిరిగినా బందరు ఆయన కార్యస్థానం .అక్కడే కలానిలయం గా అందరూ భావించే ‘’విద్యాలయం ‘’అనే స్వగ్రుహాన్ని నెల కొల్పి కవి పండిత గోస్టులకు కేంద్రంగా మార్చారు .ఆంద్రదేశం లో లబ్ధ ప్రతిస్టూలైన కవి పండితులు కళా కారులు నటులు వీరి ఇంటికి వచ్చి ఆతిధ్యాన్ని పొందేవారు .వీరి ఇంట జరిగే సాహితీ గోస్టులు రాజాస్థానాల్లో జరిగే వాటికేమీ తీసి పోలేదని భావించే వారు .శాస్త్రి గారు నాటక పక్ష పాతి .ఆంగ్ల సాహిత్యాన్ని, అక్కడి నాటకాలను ఆమూలాగ్రం గా అధ్యయనం చేసిన వారు .ఆ అనుభవం తో కాలాన్ని నాటక రంగ చర్చకు వెచ్చించిన విమర్శకాగ్రేసరులు .

ఆయన నివసించిన బందరులో అయన స్వగృహం

బందరు దగ్గర తరకటూరు  లో ‘’పర్ణశల ‘’పేరు తో ఒక విద్యా కేంద్రాన్ని స్తాపించి ,పర్ణశాలలు ఏర్పరచి ,క్రీడలకు ,ఈత కొలను నిర్మించి ఆ నాడే ఈతకు క్రీడల్లో ప్రాధాన్యత నిచ్చారు .విద్యార్ధులతో బాటు విద్యార్ధులు కూడా ఉండేట్లు వారికీ గృహాలను నిర్మించి రెసి డేన్సియల్  విద్యకు శ్రీ కారం చుట్టారు .ఆక్కడే ‘’ఆరు బయలు’’నాటక శాల నిర్మించిన కళా వేది .ఆ నాటి అన్ని సంక్షేమ కార్య క్రమాలలో భాగస్వామ్యం ఉండేది .గ్రంధాలయోద్యమ సారధి గా ఉన్నారు .జాతీయోద్యమం లో పాల్గొన్నారు .ఉప్పు సత్యాగ్రహం లో సత్యాగ్రహులను తన ఇంటి లో ఆశ్రయం ఇచ్చిన దేశ భక్తుడు .దీని వలన ఆరు నెలలు జైలు పాలయ్యారు .

పాశ్చాత్య  సాహిత్య సిద్ధాంతాలను ఆక లింపు చేసుకొన్నారు .తంజావూర్ సరస్వతి మహల్ లో రెండు నెలలు ఉండి అక్కడున్న తెలుగు గ్రందాల వివరాలను సేకరించి అంద జేసిన మొదటి వ్యక్తీ .చదివే రోజుల్లోనే మద్రాస్ లో నాటకాలను చూశారు .తమిళ మళయాళ ,కన్నడ శ్రీ లంక లలో పర్య టించి నాటక రంగాలను అధ్యయనంచేసిన నాటక పరిశోధకులు  .చిత్ర లేఖనం  శాస్త్రి గారికి ఆరవ  ప్రాణం .చిత్రాలను చిత్రించలేదు కాని వాటిని విశ్లే షించే సామర్ధ్యం ఆనందించే గుణంఉన్న వారు . ఏ నాటకాన్ని గురించి రాసినా ఆయన స్వయం గా చూసి చదివి మాత్రమె  విమర్శించేవారు .తనకు తెలిసిన విషయాలను సమకాలీనులకు తెలియ జేయాలనేదే వారి ఆలోచన .సాంస్కృతిక మేధో సంపత్తి ఉన్నవారు 1916.నుండి 1927 వరకు పన్నెండేళ్ళు వీరి నాటక విమర్శ సాగింది . ..నాటక కళ పై .ఆంధ్ర నాటక నామావళి ,నాట్యాం బుజం ,నాట్యోత్పలం ,నాట్య అశోకం ,విమర్శక పారిజాతం ,ఆంద్ర నాటక సంస్కరణలు అనే ఆరు గ్రంధాలు రచించారు .అయన కళా వైశద్యం వీటిలో జ్యోతకం అవుతుంది .నాటక రచనతో బాటు నాటక ప్రదర్శనా ముఖ్యం అని భావించేవారు .తెలుగు సమగ్ర నాటక విమర్శ కు ‘’నాట్యాం బుజం ‘’ఒక శాస్త్ర బద్ధ మైన దిశా నిర్దేశం చేసిందని మొదలి వారు అంటారు .

నాట్యో త్పలం గ్రంధం లో అధ్యాయాలకు నెల పొడుపు ,ఆట మొలకలు మొదలైన ‘’ఆట’’ పేర్లు పెట్టటం తమాషా గా ఉంది .నాట్య అశోకం లో తాటాకుల్లో పచార్లు ,చెట్ల కింద ముచ్చట్లు ,మొదలైన పేర్లు పెట్టారు .శాస్త్రి గారు స్వయం గా సారంగ ధర ,రామ దాసు ,హరిశ్చంద్ర ,కృష్ణ లీల ,లంకా దహనం అనే అయిదు నాటకాలను ఆడించారు .ఈ పుస్తకాలూ కాకుండా ఆయన కావ్య సంతానం ,రూపక రసాలం ,కావ్యాభి నందనం ,కావ్యామ్బుజం ,మానస కల్ప వల్లి ,కావ్య ,లలిత కళా రహస్యాలను తెలిపే పారి భాషకా గ్రంధం కూడా రాయాలని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు .శాస్త్రి గారు నాటకాన్ని ‘’కళా మకుటం ‘’అని గొప్ప అర్ధం వచ్చే మాట తో పిలిచారు .విమర్శ నిష్పక్ష పాతం గా ఉండాలని బోధించారు .తన కాలం నాటి నటుల అభినయ విధానాలను గురించి మొదట మూల్యాంకనం చేసిన వారు పురాణం వారే ..మౌలిక లక్ష్య లక్షణ సమన్వయము చేశారు .నాటక రంగం పై శాస్త్రి గారు చేసిన విమర్శనా పధ్ధతి తరు వాతి తరం వారికీ ఒజ్జ బంతి అయింది .అందుకే పురాణం సూరి శాస్త్రి గారు ‘’తెలుగు నాటక విమర్శ కు పితామహుడు ‘’.అని నిగ్గు తేల్చారు ఆచార్య మొగిలి నాగ భూషణ శర్మ గారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here