ఆంధ్రా జాతీయ కళాశాలలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పోలీస్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఎఆర్ కాప్స్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.ఉత్కంఠభరితంగా మంగళవారం సాగిన ఫైనల్స్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఎస్పీ లెవెన్ జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్ చేసిన ఏఆర్ కాప్స్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్నిసాధించి విజయాన్ని చేజిక్కించుకుంది.ఎస్పీ లెవెన్ జట్టు రన్నర్స్గా నిలవగా, అవనిగడ్డ జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన
ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎస్సీ రవీంద్రనాథ్బాబు ట్రోఫీలను అందజేశారు.
