జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో బందరు విద్యార్ధులు తమ ప్రతిభన ప్రదర్శించారు. కన్యాకుమారి వద్ద ఉన్న నాగర్కోయల్లో ఆరు రాష్ట్రాల క్రీడాకారులకు కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మచిలీపట్నం పరాసుపేట కేవీఆర్ పార్కు క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు. విజేతలకు మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు, కోబ్ కేశవులు బహుమతులు అందజేశారు. కటా, ఫైట్, టీమ్ కటా విభాగాల్లో రోహిత్ సాయి, ఆనంద్సాయి, చరణ్లు బహుమతులు అందుకున్నారు.
