ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతా సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మనుషులకు ఆధార్ ఉన్నట్లు గానే.. భూములకు కూడా గుర్తింపు ఉండాలని..
అందుకే ప్రతీ భూమిని గుర్తించి వాటికి ‘భూధార్’ నెంబర్ కేటాయించాలని ఆదేశించారు.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జీవో జారీ చేశారు.
అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటివ్ రిఫరెన్స్ స్టేషన్స్(కార్స్) టెక్నాలజీ ద్వారా భూములను రీసర్వే చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, రాష్ట్రమంతా భూసర్వేలో భాగంగా మొదటిదశ పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తొలుత రీసర్వే చేయనుండగా..
దీని కోసం ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లో పెట్టిన రూ. 200.15 కోట్లకు ఆమోదం తెలపాలని సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు.
