నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాల రవాణాకు సంబంధించి ఈ పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, ఈ పాస్ లు పొందవచ్చు.దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్ లేదా ఫోన్కు అనుమతులు వస్తాయి.ఈ పాస్లు కూడా ఆయా కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే ఇస్తారు.పాస్లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది.
